భావానికి రూపం ఇచ్చే
మొనగాడెవడయ్యా అంటే
అతడేలే శ్రీశ్రీ, అతడేలే శ్రీశ్రీ
ఛందస్సుని ఛాందసమంటూ
కవితావేశం కావాలంటూ
గురజాడకు నివాళులిస్తూ
తను చేసిన పథనిర్దేశం
బ్రతికించెను తెలుగు కవితనే
సామాన్యుని జన హృదయంలో
సామాన్యుని జీవన గమనం
నిజమైన చరిత్రసారమని
సంధించిన సూటిప్రశ్నలు
చేసాయోయ్ కృష్ణతాండవం
పాలకులనే కాళీయులపై
సామాన్యుని బాధని కంటూ
తను చేసిన హాహాకారం
నేనున్నా మీకోయ్ అంటూ
చూపించిన హృదయావేశం
నింపెనులే జీవనస్ఫూర్తిని
జీవచ్చవ జనహృదయంలో
అందుకే,
నేనుసైతం అశ్రువొక్కటి ధారపోస్తాను, ఆ మహాకవి స్మరణలో
నేను సైతం వెర్రిగొంతుక నిచ్చి మోస్తాను, ఆ మహాకవి కీర్తిని
hey,nice site,if u r interested view my blog als,it's.........fordevotees.blogspot.com........
ReplyDeleteExcellent Idea....
ReplyDeleteWonderful Thought,.............
Damn Inspiring...............
ReplyDeleteThanks to dis modern sree...sree...........:):)
nice blog...
ReplyDeletetrendingandhra