1. రాముడు బాలకాండలో అందరికీ ఇష్టమైన వాడు. అలాంటివాడు అడవులకు ఎందుకు వెళ్ళవలసి వచ్చినది? దీనికి నాకు తృప్తినిచ్చిన జవాబు, ధశరధుడి ఏకపక్ష నిర్ణయం. ధశరధుడు కైక లేదా భరతుడితో ఈవిషయం చెప్పివుంటే వారి అంగీకారంతో వారితో సభలో ప్రకటించి వుంటే రాముడికి ఈ అవస్త తప్పేది. లేదా కనీసం వశిష్ఠుడితో నైనా మంత్రాగం సాగించి వుంటే సభలోని వారి సంపూర్ణ అనుమతైనా వచ్చి వుండేది కనీసం కైక షరతులకు ధశరధుడు తలఒగ్గినప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పకపోవటం అందరూ నిర్ణయాన్ని రాజుకు మాత్రమే వదిలి వేశారనిపిస్తుంది. రాజు ఏది నిర్ణయించినా అభ్యంతరం చెప్పలేదు
అందరూ రాముడిని వేడుకున్నారేకానీ ధశరధుడిని దిక్కరించలేదు. ధశరధుడు కైకని వేడుకున్నాడే కానీ ధిక్కరించలేదు. దీనిని బట్టి ధశరధుని ఏకపక్ష నిర్ణయంలో ఎవరూ భాగస్వాములు కాలేదు
No comments:
Post a Comment